News December 23, 2024

రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిటీ

image

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పేసర్ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చారు. ‘నెట్స్‌లో రోహిత్ మోకాలికి బంతి బలంగా తాకింది. నొప్పితో ఆయన కాసేపు విలవిల్లాడారు. ఆ తర్వాత ఐస్ ప్యాక్ పెట్టుకుని అరగంటపాటు రెస్ట్ తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26న భారత్, ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.

Similar News

News January 22, 2025

ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు

image

హైదరాబాద్‌లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్‌తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

News January 22, 2025

BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!

image

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.

News January 22, 2025

నోటిఫికేషన్ వచ్చేసింది..

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <>https://upsconline.gov.in<<>>