News December 31, 2024

కాశీ యాత్రలో అకీరా నందన్.. ఫొటోలు వైరల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇటీవల కాశీలో పర్యటించారు. తన తల్లి రేణు దేశాయ్, సోదరి ఆద్యతో కలిసి పలు పూజలు చేశారు. కాషాయ దుస్తుల్లో అకీరా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తండ్రి మాదిరే కొడుకు సింప్లిసిటీతో ఉన్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.

Similar News

News January 13, 2025

బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?

image

యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

ఇన్ఫోసిస్: వచ్చే నెలలో జీతాల పెంపు?

image

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఫిబ్రవరిలో జీతాలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. కన్సల్టెంట్లు, సీనియర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు తదితరులకు జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సంస్థలోని ఉన్నతోద్యోగులకు హైక్ లెటర్స్ మార్చిలో అందజేసే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో <<15078700>>హైక్ ఇచ్చిన<<>> విషయం తెలిసిందే.

News January 13, 2025

న‌చ్చ‌క‌పోతే కోహ్లీ అవ‌కాశాలు ఇవ్వ‌డు: ఉత‌ప్ప‌

image

జ‌ట్టులో ఎవ‌రైనా న‌చ్చ‌క‌పోతే విరాట్ కోహ్లీ అవ‌కాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తాడ‌ని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్ర‌పంచ కప్‌కి అంబ‌టి రాయుడు ఎంపిక కాలేద‌ని, కోహ్లీకి అత‌నంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వ‌ర‌ల్డ్ క‌ప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన త‌రువాత కూడా జ‌ట్టులోకి తీసుకోలేద‌న్నారు. ఒక‌ర్ని ఇంటికి పిలిచి మొహం మీద త‌లుపులు వేయ‌డం త‌గ‌ద‌ని ఉత‌ప్ప వ్యాఖ్యానించారు.