News September 1, 2024

ALERT: వర్షాల్లో ఇవి అస్సలు చేయొద్దు: CS

image

TG: రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే వంతెనలు ఎక్కి చూడడం చేయవద్దన్నారు. ఆ సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకోవద్దని ఆమె కోరారు.

Similar News

News November 23, 2025

NGKL: గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 26, లేదంటే 27 తేదీలలో వెలువడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రావలసి ఉంది. జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంచకుండా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.

News November 23, 2025

రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

News November 23, 2025

మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

image

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.