News September 1, 2024

ALERT: వర్షాల్లో ఇవి అస్సలు చేయొద్దు: CS

image

TG: రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రజలకు పలు సూచనలు చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే వంతెనలు ఎక్కి చూడడం చేయవద్దన్నారు. ఆ సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకోవద్దని ఆమె కోరారు.

Similar News

News November 17, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

News November 17, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

News November 17, 2025

ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: KTR

image

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.