News November 14, 2024
CBSE విద్యార్థులకు అలర్ట్

వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.
Similar News
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ పేరిట 12 ఏళ్లుగా నిధులు స్వాహా 2/2

TG: ఖాళీలు భర్తీకాని తరుణంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని GOVT నియమించుకుంటుంది. ఇందుకు ఏజెన్సీలకు 20% కమీషన్ 12 ఏళ్లుగా అందిస్తోంది. ఇవన్నీ గతంలో BRS నేతల బినామీల పేరిట ఏర్పాటైనవిగా తెలుస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడంతో బోగస్ పేర్లతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. GOVT, ఉద్యోగి వాటా EPF, ESI నిధులనూ మింగేశాయి. ఇలా భారీగా దోచుకున్న సంస్థలపై ప్రభుత్వం నివేదికను రెడీ చేసింది.
News January 12, 2026
కొనసాగుతున్న రూపాయి పతనం

ఈ వారం మార్కెట్ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


