News August 8, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

AP: గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ కీలక సూచన చేశారు. అభ్యర్థులు ఏ మీడియంలో పరీక్షలు రాయాలనుకుంటున్నారో, పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను ఈ నెల 16లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కాగా 81 పోస్టుల భర్తీకి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
HNK: TASK ఆధ్వర్యంలో టెక్నికల్ కోర్సులకు శిక్షణ

చైతన్య యూనివర్సిటీలోని TASK ఆఫీసులో టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. Java, Python, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudo కోడ్, C, C++, HTML, CSS, Java Scriptపై కోచింగ్ ఇస్తారని, డిగ్రీ, B.TECH, PG పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బ్యాంకింగ్, పోటీ పరీక్షల నిమిత్తం ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కోచింగ్ ఇవ్వనున్నారు.
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.
News November 20, 2025
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.


