News April 3, 2024
విద్యార్థులకు అలర్ట్!

పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ముద్రించి షాపులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 3& 6 తరగతుల కొత్త సిలబస్ పుస్తకాలు మే నెలలోపు ప్రచురిస్తామంది. 4, 5, 9 & 11 తరగతుల పుస్తకాలు ఈ నెలలో మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించింది.
Similar News
News April 21, 2025
వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్తో రిజల్ట్స్ వస్తాయి. మార్క్స్ లిస్ట్ను ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
News April 21, 2025
26న ఎచ్చెర్లకు సీఎం.. వేట నిషేధ భృతికి శ్రీకారం

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు రూ.20వేల చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. కాగా సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తోంది.