News December 21, 2024
టీ, కాఫీ తాగే వారికి అలర్ట్!
రోజుకో కప్పు కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారు రోజుకు 3-5 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అంతకుమించితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కెఫిన్ రోజుకు 400mg వరకు మాత్రమే తీసుకోవాలి. టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్లో కెఫిన్ ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు 200mg కంటే ఎక్కువ తీసుకోకూడదు.
Similar News
News January 14, 2025
అథ్లెట్పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్
కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
News January 14, 2025
గంభీర్ కోచ్ పదవికి ఎసరు?
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపైనే హెడ్ కోచ్ గంభీర్ పదవీకాలం పొడిగింపు ఆధారపడి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. CT తర్వాత BCCI రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకోనుందట. అందులోనూ భారత్ విఫలమైతే గంభీర్ను కోచ్గా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గతేడాది జులైలో గౌతీ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ ఇండియా 10 టెస్టుల్లో 6 ఓడిపోయింది. BGT సందర్భంగా చెలరేగిన వివాదాలు తెలిసినవే.
News January 14, 2025
మోదీని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు: రాహుల్
ఢిల్లీలో అవినీతి, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రధాని మోదీ తరహాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఆప్పై శాయశక్తులా పోరాడాలని, వైఫల్యాలను ఎత్తిచూపాలని, అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలన్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.