News September 20, 2024
సీఎం తమ్ముడు, బావమరిదికే అన్ని కాంట్రాక్టులు: కేటీఆర్

TG: రాష్ట్రంలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, తోఖన్ సాహూకు లేఖ రాశారు. అర్హతలు లేకున్నా CMరేవంత్ తమ్ముడు, బావమరిదికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని విమర్శించారు. దీనిపై స్పందించకుంటే కాంగ్రెస్ అవినీతిలో కేంద్రం వాటా ఉందని ప్రజలు నమ్ముతారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
మూడేళ్లల్లో ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్: మంత్రి లోకేశ్

మూడేళ్లలో ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేశ్ వెల్లడించారు. భామని మండలంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మన్యం జిల్లాలో విద్యార్థులను సానబెడితే అద్భుతాలు సాధిస్తారన్నారు. గత మూడేళ్లుగా మన్యం జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణత స్థానంలో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మరింత కష్టపడి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
News December 5, 2025
మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ హౌస్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనగా.. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి & అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.


