News March 8, 2025

రాజకీయాలకు అతీతంగా ఎంపీలంతా ఏకం కావాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల MPలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అనంతరం మాట్లాడుతూ ‘మరోసారి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తాం. BJP, BRS ఎంపీలు వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి కేంద్రాన్ని కలవాలి. పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తాలి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News January 25, 2026

ప్రకాశం: వీటి విషయంలో జాగ్రత్త.!

image

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కడపలో జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.

News January 25, 2026

చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.

News January 25, 2026

భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

image

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.