News March 12, 2025
త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 12, 2025
బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశారు. 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
News March 12, 2025
కేఎల్ రాహుల్-అతియా ఫొటోలు వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అతి త్వరలో తండ్రి కాబోతున్నారు. వచ్చే నెలలో తమ తొలి సంతానానికి ఆయన భార్య అతియా శెట్టి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రాహుల్, అతియా 2023 జనవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
News March 12, 2025
జగన్తో తమిళనాడు మినిస్టర్ భేటీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్తో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్ను కోరారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను స్టాలిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.