News May 26, 2024
హజ్ యాత్రకు సర్వం సిద్ధం!

AP: రాష్ట్రంలో హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నుంచి 2,500 మంది ముస్లింలు యాత్రకు వెళ్లనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో వీరందరూ వివిధ విమానాశ్రయాల నుంచి బయల్దేరనున్నారు. వీరిలో 1,100 మంది హైదరాబాద్, 700కుపైగా బెంగళూరు, 692 మంది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి జెడ్డాకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మక్కా, మదీనకు చేరుకుంటారు. ముస్లింల కోసం కేసరపల్లి దుర్గాపురంలో క్యాంప్ ఏర్పాటు చేశారు.
Similar News
News December 4, 2025
గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
News December 4, 2025
రష్యాకు ఫుడ్.. మనకు ఆయిల్!

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు భారత్. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశం నుంచి ఆయిల్ను IND అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదరనుంది. ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్ $60 బిలియన్లకు పెరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్ను పంపనుంది.
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>


