News May 26, 2024
హజ్ యాత్రకు సర్వం సిద్ధం!

AP: రాష్ట్రంలో హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నుంచి 2,500 మంది ముస్లింలు యాత్రకు వెళ్లనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో వీరందరూ వివిధ విమానాశ్రయాల నుంచి బయల్దేరనున్నారు. వీరిలో 1,100 మంది హైదరాబాద్, 700కుపైగా బెంగళూరు, 692 మంది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి జెడ్డాకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మక్కా, మదీనకు చేరుకుంటారు. ముస్లింల కోసం కేసరపల్లి దుర్గాపురంలో క్యాంప్ ఏర్పాటు చేశారు.
Similar News
News February 19, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR
News February 19, 2025
MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్తో తలనొప్పి!

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?
News February 19, 2025
మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.