News September 14, 2024

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

image

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.

Similar News

News December 25, 2025

నష్టాల నుంచి సక్సెస్ వైపు అడుగులు

image

తొలి ప్రయత్నంతో నష్టంతో ఉదయ్ కుంగిపోలేదు. కృషి విజ్ఞాన కేంద్రం, యూట్యూబ్ నుంచి డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, అంతర పంటల సాగు, హైబ్రిడ్ వెరైటీలను ఆధునిక పద్ధతుల్లో పెంచడంపై శిక్షణ పొందారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీ వచ్చింది. దీంతో డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ, ఇతర కూరగాయల పంటల సాగు చేపట్టారు.

News December 25, 2025

పోలవరానికి గోదావరి పుష్కరాలే టార్గెట్: PPA సీఈవో

image

AP: పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని PPA సీఈవో యోగేశ్ స్పష్టం చేశారు. పునరావాస గ్రామాల్లో పర్యటించి మౌలిక వసతులు, పరిహారంపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రంవాల్, బట్రస్ డ్యామ్, కుడి, ఎడమ కాలువ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

News December 25, 2025

రోజూ రూ.15 వేలు.. మిరప నుంచే రూ.10 లక్షలు

image

మొత్తం 20 ఎకరాలకుగాను ఉదయ్ కుమార్ 4 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో టమాటా, 1 ఎకరంలో క్యాబేజి, అర ఎకరంలో బఠాణీ పండిస్తున్నారు. మిగిలిన భూమిలో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. కేవలం మిరప పంట ద్వారానే ఈ ఏడాది ఇప్పటి వరకు 21 టన్నుల దిగుబడిని సాధించి రూ.10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందారు. ఇలా మిరప సహా ఇతర పంటల నుంచి రోజూ రూ.10వేలు నుంచి రూ.15వేలు ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉదయ్.