News March 17, 2024
10వ తరగతి విద్యార్థులకు ALL.THE.BEST: కలెక్టర్ గౌతమీ

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూ.. ALL.THE.BEST. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 15, 2025
వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ ముందుకు: మంత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అనంతపురంలో మేధావులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనను సమన్వయం చేసుకుంటూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
News February 15, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 15, 2025
యాడికి మండల లారీ డ్రైవర్ దుర్మరణం

యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన లారీ డ్రైవర్ రాజు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మట్టి లోడ్ చేస్తున్న సమయంలో రాజు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. లారీపై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు గమనించి పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.