News December 14, 2024

దిష్టి మొత్తం పోయింది.. మంచు మనోజ్ పోస్ట్

image

తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై వచ్చిన అల్లు అర్జున్ సంతోషంగా ఉండాలని కోరుతూ హీరో మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ‘దిష్టి మొత్తం పోయింది బాబాయ్. క్లిష్ట పరిస్థితుల్లో మీరు ప్రవర్తించిన తీరు ప్రశంసనీయం. సరైన సమయంలో బాధిత కుటుంబానికి మద్దతివ్వడం మీ క్యారెక్టర్‌కు నిదర్శనం. సంధ్య థియేటర్ విషాద ఘటన హృదయవిదారకం. ఈ ఘటన భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుచేస్తుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 26, 2025

‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి

image

‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

News January 26, 2025

కవులు, కళాకారులు తెలంగాణలో లేరా?: RSP ప్రశ్న

image

TG: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై BRS నేత RS ప్రవీణ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన మందకృష్ణ మాదిగ, డా.నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు చెబుతూనే కేంద్రంపై మండిపడ్డారు. సాహిత్యం, కళల రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. TGలో కవులు, కళాకారులు లేనే లేరా? కేవలం APలోనే ఉన్నారా? అంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలను ప్రశ్నించారు.

News January 26, 2025

పద్మకు ఎంపికైన వారికి CM అభినందనలు

image

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి CM రేవంత్ అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ సహా ఈ పురస్కారాలకు <<15260048>>తెలుగువారు <<>>ఎంపిక కావడంపై CM హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగాల్లో చేసిన కృషి, అంకితభావమే వారికి ఈ పురస్కారాలు దక్కేలా చేసిందని కొనియాడారు.