News February 19, 2025
ALL TIME RECORD

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News March 28, 2025
బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <
News March 28, 2025
మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

బాలీవుడ్లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మూవీని రిలీజ్ చేశారు.
News March 28, 2025
బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.