News August 7, 2024

GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి హవా

image

AP: విశాఖపట్నం GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 10కి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం ఆగస్టు 30న జరిగే స్థానిక సంస్థల MLC ఎన్నికలపై పడే అవకాశం ఉంది.

Similar News

News December 7, 2025

₹500 కోట్లు ఇచ్చినోళ్లు సీఎం అవుతారు: సిద్ధూ భార్య

image

₹500 కోట్లు ఇచ్చిన వాళ్లు CM అవుతారని నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను CM అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పారు. ‘పంజాబ్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అవకాశం ఇస్తే పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం. CM కుర్చీ కోసం ఇచ్చేందుకు మా దగ్గర ₹500 కోట్లు లేవు’ అని చెప్పారు. అయితే తమను ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు.

News December 7, 2025

TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<>TCIL<<>>)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫామ్‌, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/

News December 7, 2025

తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

image

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.