News February 17, 2025

26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

image

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.

Similar News

News January 3, 2026

చెదపురుగులతో పంటకు నష్టం.. నివారణ ఎలా?

image

వ్యవసాయంలో పంట మొలక నుంచి కోత వరకు అన్ని దశల్లో చెదపురుగుల వల్ల 10 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ పురుగులు పంట మొక్కల వేర్లను, చెట్ల కాండాన్ని ఆశించి లోపలి మెత్తని భాగాన్ని తినడం వల్ల అవి వడలిపోయి, ఎండి చనిపోతుంటాయి. చల్కా ఎర్రమట్టి నేలల్లో, నీటి ఎద్దడి ఉన్న తోటల్లో వీటి ఉద్ధృతి ఎక్కువ. ఏ పంటలకు చెదల ముప్పు ఎక్కువ? వీటిని ఎలా నివారించాలో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 3, 2026

5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

image

AP: ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఈ నెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు సూచించింది.

News January 3, 2026

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.