News January 21, 2025

కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు

image

AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.

Similar News

News February 16, 2025

IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

image

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్‌లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.

News February 16, 2025

మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

image

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్‌లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్‌లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.

News February 16, 2025

ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.

error: Content is protected !!