News December 13, 2024

Allu Arjun Arrest: షారుఖ్-వడోదర కేసు ఏంటంటే..

image

అల్లు అర్జున్‌పై హైకోర్టులో వాదనల సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది షారుఖ్-వడోదర తొక్కిసలాట కేసును నివేదించారు. తన సినిమా రయీస్‌ ప్రమోషన్ల కోసం 2017లో షారుఖ్ గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఫ్యాన్స్‌కు బహుమతులు విసిరేయగా, అందుకునే క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి మరణించారు. అయితే ఆ కేసులో షారుఖ్‌ తప్పులేదని సుప్రీంకోర్టు 2022, ఏప్రిల్ 27న తేల్చింది.

Similar News

News January 23, 2025

భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు

image

MP ఇండోర్‌లో ఓ గుడి ముందు యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు అతడికి జైలు శిక్ష కానీ రూ.5 వేల ఫైన్ కానీ విధించనుంది. ఇండోర్‌ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా భిక్షాటనను నగరంలో బ్యాన్ చేశారు. కొందరు యాచకులకు ఇళ్లు ఉన్నా, తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా భిక్షమెత్తుకుంటున్నట్లు పోలీసులు గుర్తించడం విశేషం.

News January 23, 2025

‘గాంధీ తాత చెట్టు’ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు

image

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’పై సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుందని చెప్పారు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. చిన్నారి నేస్తం సుకృతి శక్తిమంతమైన ప్రదర్శనతో తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కళాఖండాన్ని చూసి తీరాలని Xలో రాసుకొచ్చారు.

News January 23, 2025

బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎంకు కవిత లేఖ

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLC కవిత విమర్శించారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కుంటి సాకులతో తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను సహించబోదని హెచ్చరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు.