News January 7, 2025
కాసేపట్లో కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ బేగంపేట్లోని కిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతితో బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Similar News
News January 18, 2025
మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్
TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.
News January 18, 2025
సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI
సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.
News January 18, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు
టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశానన్నారు.