News May 25, 2024
అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. కానిస్టేబుళ్లపై వేటు

AP: నంద్యాలలో YCP అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో తొలిగా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ర్యాలీ సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో కానిస్టేబుళ్లు నాయక్, నాగరాజులను SP వీఆర్కు పంపారు. మరికొందరు అధికారులపైనా చర్యలుంటాయేమో చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్, రవిపైనా కేసు నమోదైంది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల రాగా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని ECకి ఫిర్యాదులందాయి.
Similar News
News December 19, 2025
ఎన్నికల్లో పోటీ చేశారా? ఇలా చేయకుంటే చర్యలు తప్పవు!

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చు నివేదికలను ఎంపీడీవోలకు సమర్పించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సకాలంలో అందజేయకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బరిలో నిలిచినవారు వివరాలు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది.
News December 19, 2025
అధిక పోషక విలువల మాంసం.. కడక్నాథ్ సొంతం

అత్యంత పోషక విలువల కలిగిన మాంసానికి కడక్నాథ్ కోళ్లు ప్రసిద్ధిచెందాయి. వీటి చర్మం, మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. మధ్యప్రదేశ్లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్గా పిలుస్తారు. నాటుకోడితో పోలిస్తే ఈ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఈ కోళ్లు 6 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏటా 100 నుంచి 110 గ్రుడ్లను మాత్రమే పెడతాయి. వీటి గుడ్లకు, మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
News December 19, 2025
శ్రీవారిని దగ్గర నుంచి చూడాలంటే?

సాధారణ భక్తులు 70 అడుగుల దూరం నుంచి స్వామిని చూస్తే, లక్కీడిప్లో ఎంపికైన వారు 9 అడుగుల దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఆన్లైన్ లక్కీడిప్లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. అందుకే మీరు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ నేరుగా ‘ఆఫ్లైన్ లక్కీడిప్’లో నమోదు చేసుకుంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్కు రూ.10 వేలు డొనేట్ చేయడం వల్ల కూడా మొదటి గడప దర్శన భాగ్యం లభిస్తుంది.


