News July 30, 2024

ఇప్పటికే పెట్రోల్, పాలు.. తాజాగా బీర్ల ధరలు పెంపు

image

కర్ణాటకలో బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. గత 17 నెలల్లో మద్యం ధరలు ఎగబాకడం ఇది 5వ సారి. ముడి సరుకుల ధరల్లో మార్పుల వల్లే రేట్లను పెంచినట్లు కంపెనీలు తెలిపాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరినప్పటి నుంచి వాణిజ్య వాహనాలపై రవాణా సెస్, స్టాంప్ డ్యూటీ, పెట్రోల్ లీటర్‌పై రూ.3, నందిని పాల ధరలు పెరిగాయి. 5 గ్యారంటీల అమలుకు నిధుల కొరతే రేట్ల పెరుగుదలకు కారణమని వార్తలొస్తున్నాయి.

Similar News

News November 12, 2025

బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

image

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్‌<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

News November 12, 2025

నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

image

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్‌పై ప్రభావం చూపింది.

News November 12, 2025

హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.