News December 16, 2024
అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది: పొంగులేటి

TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి వెళ్తోందనేది ప్రచారం మాత్రమే. ఇటీవల వరదల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి భయం పట్టుకుంది. HYD, బెంగళూరుకే ఇన్వెస్టర్లు వస్తున్నారు. హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసింది’ అని అన్నారు.
Similar News
News January 23, 2026
JC vs పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హై అలర్ట్

AP: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. JC ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పరస్పరం సవాల్ విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసరగా.. సిద్ధమంటూ ఆయన ఇంటి ముట్టడికి JC వర్గీయులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ TDP కౌన్సిలర్లు పెద్దారెడ్డిపై PSలో ఫిర్యాదు చేశారు.
News January 23, 2026
‘₹40 లక్షలు మోసం చేశాడు’.. మంధాన మాజీ ప్రియుడిపై ఫిర్యాదు

భారత క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ₹40 లక్షలు మోసం చేశారని సాంగ్లి(MH)లో విజ్ఞాన్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నజరియా అనే మూవీలో ఇన్వెస్ట్ చేయాలని, నటించే ఛాన్స్ ఇస్తానని పలాశ్ చెప్పాడు. అతడికి ₹40 లక్షలు ఇచ్చా. ప్రాజెక్టు పూర్తి కాలేదు. డబ్బు ఇవ్వమంటే పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. అటు FIR నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.
News January 23, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (<


