News December 16, 2024
అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది: పొంగులేటి

TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి వెళ్తోందనేది ప్రచారం మాత్రమే. ఇటీవల వరదల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి భయం పట్టుకుంది. HYD, బెంగళూరుకే ఇన్వెస్టర్లు వస్తున్నారు. హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసింది’ అని అన్నారు.
Similar News
News December 27, 2025
ఈ ఏడాది రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!

భారతీయ చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 5 సినిమాలు ఒక్కోటి రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. వాటిలో ఛావా, కాంతారా చాప్టర్-1, సైయారా, కూలీ, ధురంధర్ చిత్రాలున్నాయి. అటు కొన్నేళ్లుగా హిట్ మూవీలు లేక డీలా పడిన బాలీవుడ్కు ఫిబ్రవరిలో వచ్చిన ఛావా, ఏడాది చివర్లో ధురంధర్ సినిమాలు జోష్ నింపాయి. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు సాధించిన మూవీలు 8 ఉండగా, తాజాగా ఆ లిస్టులో ధురంధర్ చేరింది.
News December 27, 2025
మరణంలోనూ వీడని స్నేహం

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.
News December 27, 2025
యూపీలో 2.89కోట్ల మంది ఓటర్లు తొలగింపు!

ఉత్తర్ ప్రదేశ్లో SIR గడువు నిన్నటితో ముగియగా DEC 31న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో 15.44కోట్ల మంది ఓటర్లకు గానూ 2.89కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే JAN 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. FEB 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.


