News March 19, 2025
అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
ట్రంప్కు షాక్.. కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. $2.2 బిలియన్ల <<16113020>>ఫండ్స్ <<>>నిలిపేస్తామని బెదిరింపులకు పాల్పడటంపై లీగల్ యాక్షన్కు సిద్ధమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బలవంతంగా హార్వర్డ్ను తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.
News April 22, 2025
అట్లీ సినిమా కోసం బన్నీ కొత్త లుక్

అట్లీ- అల్లు అర్జున్ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో బన్నీపై లుక్ టెస్టుతోపాటు ఫొటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండు లుక్స్ను ఫైనల్ చేస్తారని టాక్. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ పలు గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్లో మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.
News April 22, 2025
మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.