News April 14, 2025
అమర్నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <
Similar News
News January 24, 2026
కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.11.05కోట్ల వ్యయంతో బ్లడ్ ఫిల్టరేషన్ మెషీన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎస్.కోట, సీతంపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కిడ్నీ రోగుల చికిత్సకు 2024-25లో ప్రభుత్వం రూ.164 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
News January 24, 2026
చెలరేగిన భారత బౌలర్లు.. NZ 135 రన్స్కే ఆలౌట్

U19 మెన్స్ వరల్డ్ కప్లో భారత్తో మ్యాచులో న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు మ్యాచ్ కుదించగా టీమ్ ఇండియా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో 22 పరుగులకే NZ సగం వికెట్లు కోల్పోయింది. శాంసన్(37*), సంజయ్(28), కటర్(23) ఫర్వాలేదనిపిండంతో జట్టు స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అంబరీశ్ 4, హెనిల్ 3, ఖిలాన్, మహ్మద్, కనిష్క్ తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 136.
News January 24, 2026
ఎల్లుండి విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా VD14 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నట్లూ ప్రచారం జరుగుతోంది.


