News April 14, 2025
అమర్నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <
Similar News
News January 28, 2026
వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: రామ్మోహన్

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. మరోవైపు కాసేపట్లో రామ్మోహన్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. MHలోని బారామతిలో ఈ ఉదయం ఫ్లైట్ క్రాషై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.
News January 28, 2026
మహిళా పైలట్పై అజిత్ పవార్ ట్వీట్.. వైరల్

మహారాష్ట్రలో జరిగిన <<18980548>>ప్రమాదంలో<<>> అజిత్ పవార్తోపాటు మహిళా పైలట్ శాంభవీ పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్గా ఉన్నది ఓ మహిళ అని అర్థం చేసుకోవాలి’ అని 2024 జనవరి 18న ఆయన ట్వీట్ చేశారు. #NCPWomenPower అని హాష్ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
News January 28, 2026
విమాన ప్రమాదం.. ఎవరీ శాంభవీ పాఠక్!

<<18980548>>విమాన ప్రమాదం<<>>లో అజిత్ పవార్తో పాటు ఐదుగురు చనిపోవడం తెలిసిందే. వీరిలో కెప్టెన్ శాంభవీ పాఠక్ కూడా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్ కూతురైన శాంభవి ముంబై వర్సిటీలో Bsc పూర్తి చేశారు. న్యూజిలాండ్లో పైలట్ శిక్షణ తీసుకున్నారు. DGCA నుంచి లైసెన్స్ పొందారు. 2022 ఆగస్టు నుంచి <<18981334>>VSR వెంచర్స్<<>>లో ఫస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. Learjet45 విమానాలు నడుపుతున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా మరణించారు.


