News April 14, 2025
అమర్నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <
Similar News
News April 16, 2026
దేవతలు కలలో వస్తే ఏం జరుగుతుంది?

కలలో దేవతలు కనిపించడం శుభప్రదమట. ఇది మీపై దైవానుగ్రహం ఉందని, త్వరలోనే మీ సమస్యలు తొలగిపోతాయని సూచనట. అలాగే శుభవార్తలు వింటారని చెప్పడానికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతోంది. ‘దేవతలు ఆశీర్వదిస్తున్నట్లు, చిరునవ్వుతో కనిపిస్తే తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఏదైనా ధర్మ కార్యంలో పొరపాటు చేస్తున్నారని, మొక్కులు మరచిపోయారని అర్థం’ అని సూచిస్తున్నారు నిపుణులు.
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


