News March 6, 2025
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

కశ్మీర్లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
Similar News
News February 2, 2026
805 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC)805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్లో 105 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD అర్హత గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cdac.in
News February 2, 2026
INC రెబల్స్కు 24 గంటల గడువు

TG: మున్సి‘పోల్స్’ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు వేసిన నామినేషన్లపై అందిన నివేదికను TPCC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ పరిశీలించారు. అనేక చోట్ల రెబల్స్ బెడద ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు బరి నుంచి తప్పుకొనేలా చేయాలని మంత్రులు, DCC అధ్యక్షులను ఆదేశించారు. దానిపై మళ్లీ నివేదిక సమర్పించాలని సూచించారు.
News February 2, 2026
అందుకే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు: మృణాల్

తాను నటిని కావడం వల్లే తన మాజీ బాయ్ఫ్రెండ్ బ్రేకప్ చెప్పినట్లు మృణాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు చాలా ఇంపల్సివ్గా ఉంటావు. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు హీరోయిన్వి.. అది కూడా నాకు నచ్చదు’ అన్నాడని తెలిపారు. ఆ రిలేషన్ ముగిసిపోవడం తన మంచికేనని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేవని మృణాల్ అన్నారు. ఆమె నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


