News August 14, 2024
దేశ విభజన బాధితులకు అమిత్ షా నివాళి

చరిత్రను గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తును నిర్మించుకొని శక్తిమంతంగా ఎదుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆగస్టు 14, దేశ విభజన గాయాల స్మృతి దినం నేపథ్యంలో ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే దారుణమైన రోజు ఇది. దేశ విభజనతో ప్రాణాలు, ఇళ్లు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన లక్షల మందికి ఇదే నా నివాళి. మోదీ నాయకత్వంలో జాతి నిర్మాణం కోసమే ఈ స్మృతి దినాన్ని నిర్వహిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.
News November 20, 2025
బెంటోనైట్ క్లే గురించి తెలుసా?

చర్మాన్ని సంరక్షించడంలో ఫేస్ ప్యాక్లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఒకటే ఈ బెంటోనైట్ క్లే. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేని, చర్మంలోని మురికిని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.


