News April 27, 2024
అమ్మఒడి నగదు రూ.17వేలకు పెంచుతాం: సీఎం

AP: అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో స్కూల్ బాగోగుల కోసం రూ.2 వేలు కేటాయించి, మిగతా రూ.15 వేలను తల్లుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని.. ఐదేళ్లలో రూ.1,50,000 వరకు పెంచుతామన్నారు. కాపునేస్తాన్ని రూ.1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ.లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ప్రకటించారు.
Similar News
News November 18, 2025
పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

TG: హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.
News November 18, 2025
పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

TG: హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.
News November 18, 2025
POK ప్రధానిగా రజా ఫైసల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.


