News April 5, 2025
USలోని ఉక్రెయిన్ పౌరులను హడలెత్తించిన ఇ-మెయిల్!

అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ పొరపాటున వచ్చిన ఓ మెయిల్ ఉక్రెయిన్ పౌరులను కంగుతినేలా చేసింది. ‘USAలో తాత్కాలిక నివాసానికి కల్పించిన పెరోల్ను రద్దు చేస్తున్నాం. 7రోజుల్లోగా దేశాన్ని విడిచివెళ్లాలి’ అనేది దాని సారాంశం. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ మెయిల్ పొరపాటున వెళ్లిందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News April 24, 2025
గేమ్ ఛేంజర్ అందుకే ఫ్లాప్ అయింది: కార్తీక్ సుబ్బరాజ్

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన రామ్ చరణ్ ’గేమ్ ఛేంజర్’ సినిమా డిజాస్టర్గా నిలిచింది. అందుకు గల కారణాన్ని తమిళ డైరెక్టర్, ఆ మూవీ కథ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్కు చెప్పాను. కానీ తర్వాత స్టోరీని పూర్తిగా వేరేలా మార్చారు. కొత్త రైటర్లు చాలామందిని తీసుకున్నారు. కథ, స్క్రీన్ప్లే సమూలంగా కొత్త సినిమాను తలపించాయి’ అని పేర్కొన్నారు.
News April 24, 2025
వరంగల్లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
News April 24, 2025
పహల్గామ్ దాడి.. ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన

పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. అదిల్ హుస్సేన్, అలీ భాయ్ (తల్హా భాయ్), హషీమ్ ముసా (సులేమాన్) ఊహాచిత్రాలతో పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.20లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.