News July 17, 2024
వారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: జీవన్ రెడ్డి

TG: విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం రేవంత్కు MLC జీవన్ రెడ్డి లేఖ రాశారు. దీంతో పాటు రాష్ట్రానికి వచ్చి స్థిరపడే వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉపాధికి గల్ఫ్ వెళ్లే వారి నుంచి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోందన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం లేదని, అలాంటి వారికి సహాయ పడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


