News April 2, 2024

సచివాలయానికి వెళ్తూ వృద్ధుడు మృతి.. రూ.5 లక్షల పరిహారం

image

AP: పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్‌ తూరంగిలో వెంకట్రావ్(70) అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

Similar News

News November 15, 2025

బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్‌పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 15, 2025

ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

image

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.

News November 15, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(<>TSLPRB<<>>) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(MPC,Bi.PC), MSc(ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్,కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, జెనిటిక్స్, బయో కెమిస్ట్రీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్), M.Tech, MCA, BSc, BCAఉత్తీర్ణులై ఉండాలి. ఈనెల 27 నుంచి DEC 15వరకు అప్లై చేసుకోవచ్చు.