News December 21, 2024
లెజెండరీ క్రికెటర్లకు దక్కని ఫేర్వెల్
టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ లభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. భారత క్రికెట్కు అత్యుత్తమ సేవలందించిన యువరాజ్, ద్రవిడ్, సెహ్వాగ్, VVS లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ధోనీ, సురేశ్ రైనా, ధవన్, అశ్విన్లకు గుర్తుండిపోయే ఫేర్వెల్ ఇవ్వాల్సిందంటున్నారు.
Similar News
News January 18, 2025
భారీ ఎదురుదెబ్బ: మావో కీలక నేతతో పాటు 17 మంది మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఇటీవల జరిగిన <<15172708>>ఎన్కౌంటర్లో<<>> మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.
News January 18, 2025
JEE మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 అడ్మిట్ కార్డులను NTA రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఇక్కడ <
News January 18, 2025
ఎయిర్ షో: నెల రోజులు మాంసం దుకాణాలు బంద్.. ఎందుకంటే?
బెంగళూరు యెలహంకలో ఏరో ఇండియా 15th ఎడిషన్ షో FEB 10 నుంచి 14 వరకు జరగనుంది. దీంతో షో జరిగే 13KMల పరిధిలో మాంసం దుకాణాలు, నాన్ వెజిటేరియన్ హోటల్స్, రెస్టారెంట్స్ను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. JAN 23 నుంచి FEB 17 వరకు ఆ రూల్స్ అమల్లో ఉంటాయన్నారు. ‘చెత్తలో పడేసే మాంసాహారం పక్షులను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఎయిర్ షో సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్సుంది’ అని పేర్కొన్నారు.