News March 17, 2024
అనకాపల్లి: ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం’

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News January 22, 2026
విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.
News January 21, 2026
జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.
News January 21, 2026
గోపాలపట్నం రైల్వే ట్రాక్పై వ్యక్తి ఆత్మహత్య

గోపాలపట్నం రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కొత్తపాలెం-గోపాలపట్నం రైల్వే క్యాబిన్ వద్ద బాడీ పట్టాలపై ఉండడానికి గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోపాలపట్నం పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు గోపాలపట్నం లోని మెడికల్ షాప్ నిర్వహిస్తున్న సాయి కృష్ణగా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


