News March 17, 2024
అనకాపల్లి: ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం’

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News February 7, 2026
విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విశాఖ ఐటీ హిల్స్కు వెళ్లే ఉద్యోగుల కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో అదనంగా రెండు ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. అలాగే జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం అమలులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు.
News February 7, 2026
మాతృ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ మాతృ మరణాలపై శనివారం సమావేశం నిర్వహించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో భవాని గార్డెన్స్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రం, గాజువాక పరిదిలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని DMHO జగదీశ్వర రావు వివరించారు. మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలని, హైరిస్క్ గర్భిణీలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్కి గానీ VGHకు గానీ రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు.
News February 7, 2026
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆశిల్ మెట్ట జంక్షన్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించనున్న బడ్జెట్ ప్రచార అభియాన్-2026 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం 4.40 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.


