News March 16, 2024
అనంత: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు శనివారం అనంతపురం రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రోజుల్లో హల్ టికెట్ చూపించి అన్ని పల్లెవెలుగు, అల్ట్రా సర్వీసు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
Similar News
News September 29, 2024
పింఛన్ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలని సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 28, 2024
ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
News September 28, 2024
అనంత: 10 ఏళ్ల చిన్నారిపై VRA అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.