News March 29, 2024
ఇక మన ‘టైమ్’

భారత్లోని గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రుబీడియం అటామిక్ క్లాక్’ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నాయి.
Similar News
News April 2, 2026
గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News April 2, 2026
రాముడి లుక్కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
News April 2, 2026
ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.


