News March 31, 2024
టీసీఎస్పై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్పై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు సమాన అవకాశాల్ని కల్పించడంపై కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.
Similar News
News April 6, 2026
ట్రంప్ను పదవి నుంచి తొలగిస్తారా?

ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఓ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సమాచారం. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇరాన్తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. ట్రంప్ను 25వ అమెండ్మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ‘Yes’ అన్నవారి సంఖ్య గతనెలలో 28.6% ఉండగా ఇప్పుడది 35.1%కి చేరింది.
News April 6, 2026
₹6.5 లక్షల కోట్లకు బంగారం దిగుమతులు

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలోకి బంగారం దిగుమతులు 28.73% పెరిగాయి. వీటి విలువ సుమారు ₹6.5 లక్షల కోట్లుగా నమోదైంది. పసిడి ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 దాటిపోయింది. స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40% బంగారం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల ప్రభావంతో దేశ వాణిజ్య లోటు కూడా పెరిగి ₹29.20 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
News April 6, 2026
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సెటైర్లు!

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకానికి పంపుతానంటూ బూతులతో ట్రంప్ <<19575126>>హెచ్చరించడం<<>>పై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ‘ఓ టీనేజర్లా అధ్యక్షుడు బూతులు తిట్టే తీరు చూస్తుంటే.. అమెరికా ఊహించిన దాని కంటే ముందే రాతియుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది’ అని థాయ్లాండ్లోని ఇరాన్ ఎంబసీ ఎద్దేవా చేసింది. ‘ట్రంప్.. ఇంకేదైనా మాట్లాడవా. బోర్ కొడుతోంది’ అంటూ జింబాబ్వేలోని ఎంబసీ ఎగతాళి చేసింది.


