News August 18, 2025

ఎల్లుండి వరకు ‘అన్నదాత సుఖీభవ’ గ్రీవెన్స్

image

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉండీ లబ్ధి పొందని రైతులు ఈ నెల 20లోగా గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పరిశీలన, ధ్రువీకరణలో రిజెక్ట్ అయిన దరఖాస్తులు, ఈ కేవైసీ చేసుకోక తిరస్కరణకు గురైన రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. కాగా గత నెల 27 వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు వెల్లడించారు.

Similar News

News August 20, 2025

ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

image

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.

News August 20, 2025

UPI: స్కాన్ చెయ్ సరుకులు తెచ్చెయ్!!

image

ఇంటి పక్కన కిరాణా షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు కౌంటర్ ఏదైనా.. UPI స్కాన్‌తో కొనేస్తున్నాం. ఈ జులైలో 303 కోట్ల ట్రాన్సాక్షన్లతో (₹64,881Cr) గ్రోసరీస్ టాప్ UPI కేటగిరీగా ఉంది. అంటే పాల ప్యాకెట్లు, ఉప్పు, పప్పులు వగైరా కిరాణా సరుకులు, కాయగూరలకు ఎక్కువ UPI పేమెంట్స్ చేస్తున్నారు. ఇక టీ, టిఫిన్, స్నాక్స్ సెంటర్లది సెకండ్ ప్లేస్ (100 కోట్ల పేమెంట్లు, ₹13794 Cr) . మీరు UPIని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు?

News August 20, 2025

మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

image

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.