News April 10, 2024

2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన!

image

TG: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, 2-3రోజుల్లో వారి పేర్లను వెల్లడించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లి.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారట.

Similar News

News March 27, 2025

IT కంపెనీలు, ఉద్యోగులకు Shocking News

image

దేశీయ IT కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్‌ను మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్‌లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60% ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester తెలిపింది. గతంలో 3-5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టనుంది.

News March 27, 2025

రాత్రి 7.30కు పవర్ కట్ అంటూ సైబర్ మోసం

image

TG: సైబర్ నేరగాళ్లు కొత్త మోసంతో మాయ చేస్తున్నారు. ‘మీరు గత నెల కరెంట్ బిల్ చెల్లించలేదు. ఇవాళ రాత్రి 7.30కు పవర్ కట్ అవుతుంది’ అని పలువురు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ వర్గాలు స్పందించాయి. TGSPDCL ఎప్పుడూ ఇలాంటి మెసే‌జ్‌లు పంపదని, ఉద్యోగులెవరూ వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకోరని స్పష్టం చేశాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

News March 27, 2025

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ ఆందోళన

image

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!