News December 22, 2024
స్మృతి మంధాన మరో ఘనత
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.
Similar News
News January 25, 2025
‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం
కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
News January 25, 2025
PHOTO: రిహార్సల్స్ మొదలుపెట్టిన మహేశ్ బాబు
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైందని నిన్న జక్కన్న హింట్ ఇచ్చారు. తాజాగా మహేశ్ ఫొటో వైరలవుతోంది. ఆయన స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైనర్తో పాటు ఉన్న ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిహార్సల్స్ మొదలయ్యాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News January 25, 2025
RCBకి పెద్ద దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
WPL-2025కి RCB ఆల్ రౌండర్ సోఫీ డివైన్ దూరమయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్రొఫెషనల్ అడ్వైజ్ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు NZ పేర్కొంది. WPLలో RCB తరఫున 18 మ్యాచులాడిన సోఫీ 402 రన్స్, 9 వికెట్లు తీశారు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు(99*) ఆమె పేరిటే ఉంది. ఓపెనర్గా మెరుపులు మెరిపించే ఈ ప్లేయర్ లేకపోవడం RCB పెద్ద లోటే.