News January 4, 2025
బుమ్రా ఖాతాలో మరో ఘనత!
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఆయన రికార్డు సృష్టించారు. నిన్న ఖవాజాను ఔట్ చేసిన జస్ప్రీత్, ఈరోజు లబుషేన్ను ఔట్ చేసి సిరీస్లో వికెట్ల సంఖ్యను 32కు పెంచుకున్నారు. ఈక్రమంలో 46 ఏళ్ల క్రితం బిషన్ సింగ్ బేడీ నెలకొల్పిన రికార్డు తిరగరాశారు. భారత బౌలింగ్ భారం మొత్తాన్ని బుమ్రా ఒక్కరే మోస్తుండటం గమనార్హం.
Similar News
News January 22, 2025
తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
News January 22, 2025
మహా కుంభమేళాకు వెళ్తున్నారా?
‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్లైన్లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.
News January 22, 2025
కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.