News December 21, 2024
TGలో మరో అగ్రికల్చర్ కాలేజీ.. ఎక్కడంటే?

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట (D) హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి.
Similar News
News April 11, 2026
ప్రెసిడెంట్గా పోటీ చేయడంపై ఆలోచిస్తున్నా: కమలా హారిస్

2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆలోచిస్తున్నానని US మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడగగా ఆమె స్పందించారు. ‘4ఏళ్లు ప్రెసిడెంట్ పదవికి అతి దగ్గరగా పనిచేశా. ఆ పదవి బాధ్యతలేంటో, దానికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. అధ్యక్ష పదవి వ్యక్తిగత కోరిక కాకూడదు. ప్రజలకు మంచి చేయడం గురించి ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.
News April 11, 2026
వచ్చే వారం CBSE టెన్త్ ఫలితాలు?

వచ్చే వారం CBSE టెన్త్ క్లాస్ (సెషన్-1) ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 8వేలకు పైగా సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఈ ఏడాది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని CBSE నిర్ణయించింది. మొదటి సెషన్ కంపల్సరీ కాగా పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు రెండో సెషన్ రాయొచ్చు. మే 15 నుంచి జూన్ 1 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
News April 11, 2026
సీజ్ఫైర్.. బియ్యం ధరలకు రెక్కలు!

పశ్చిమాసియాలో శాంతి చర్చలు బియ్యం ధరలకు రెక్కలు తెచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్తో అరబ్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత 2 రోజుల్లోనే బియ్యం హోల్ సేల్ ధరలు 7% పెరిగాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా సోమవారం నుంచి భారీగా ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో రిటైల్ మార్కెట్లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.


