News September 29, 2024

ఆఫీసులో ఆగిన మరో గుండె.. టెకీ దుర్మరణం

image

పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని HCL కార్యాలయం వాష్‌రూమ్‌లో టెకీ నితిన్ ఎడ్విన్(40) కుప్పకూలారు. సహచరులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లక్నోలోని HDFC బ్యాంక్‌ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సదాఫ్ ఫాతిమా, పుణేలో CA సెబాస్టియన్ పెరయిల్ ఇలాగే కన్నుమూశారు.

Similar News

News December 1, 2025

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

image

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్‌లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్‌ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్‌తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.

News December 1, 2025

పురుషులు, స్త్రీలు ఎంత నీరు తాగాలంటే?

image

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. US అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్లు, స్త్రీలు 2.7లీటర్ల మేర నీరు సేవించాలంటున్నారు. వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతాయని, గర్భిణులు & పాలిచ్చే తల్లులు నీటిని ఎక్కువ సేవించాలని చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే ‘హైడ్రేషన్’, ఎక్కువ సేవిస్తే ‘హైపోనాట్రేమియా’ సమస్యలొస్తాయంటున్నారు.

News December 1, 2025

సమంత-రాజ్ వివాహ ప్రక్రియ గురించి తెలుసా?

image

<<18437680>>సమంత-రాజ్<<>> ఈషా కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచే పవిత్ర ప్రక్రియే ఇది. లింగ భైరవి లేదా ఎంపిక చేసిన ఆలయాల్లో ఈ తరహా క్రతువులు నిర్వహిస్తారు. దీంతో దంపతుల మధ్య సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెంపొందుతుందని విశ్వసిస్తారు. సద్గురు చేతుల మీదుగా ఈ లింగ భైరవి దేవి ప్రాణప్రతిష్ఠ జరిగింది.