News December 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.

Similar News

News January 14, 2025

శివకార్తికేయన్ ఫ్యామిలీని చూశారా?

image

తమిళ హీరో శివకార్తికేయన్ ఇటీవల వచ్చిన అమరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఫ్యామిలీ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరోకు భార్య ఆర్తి, ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శివకార్తికేయన్, ఆర్తి 2010లో పెళ్లి చేసుకున్నారు.

News January 14, 2025

పండగ వేళ తగ్గిన బంగారం ధరలు

image

సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

News January 14, 2025

ఫ్యామిలీతో చెర్రీ సెలబ్రేషన్స్

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.