News April 6, 2024

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి!

image

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఓహియోలోని క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి చనిపోయాడు. అతని మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అతని స్వస్థలం మొదలైన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా USలో ఈ ఏడాది.. ఇప్పటివరకు 10 మంది భారత్/భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News January 19, 2025

లోకేశ్‌ను Dy.CM చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదు: అంబటి

image

AP: లోకేశ్‌ను Dy.CM చేస్తానన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి అమిత్ షా ఒప్పుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘షా ఏమన్నారో మాకు తెలుసు. లోకేశ్‌ అన్నిశాఖల్లో వేలు పెడుతున్నారని, కంట్రోల్‌లో ఉంచమని బాబుకు సూచించారు. లోకేశ్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారు’ అని తెలిపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

News January 19, 2025

కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

News January 19, 2025

ఈ ఏడాది అతిపెద్ద ముప్పు ఇదే..

image

2024లో ఎన్నో యుద్ధాలను చూసిన ప్రపంచానికి ఈ ఏడాది కూడా ఆ ముప్పు తప్పదని ఓ రిపోర్టు వెల్లడించింది. 2025లో దేశాల వార్ కారణంగానే 23% ప్రమాదం ఉంటుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్-వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. ఆ తర్వాత వాతావరణ మార్పులు(14%), భౌగోళిక ఆర్థిక సమస్యల(8%) వల్ల ముప్పు ఉందంది. వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచార వ్యాప్తి, పదేళ్లలో తీవ్ర వాతావరణ మార్పులు ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొంది.