News April 2, 2024
దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం

దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం సిద్ధమవుతోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 50,000 సీట్ల కెపాసిటీతో బీసీసీఐ స్టేడియం నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో దీనిని రూపొందిస్తోంది. మిరాజ్ గ్రూప్ సంస్థతో కలిసి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఈ మైదానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ గ్రౌండ్లో మొత్తం 12 పిచ్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే దీని నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 18, 2025
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా?: మంత్రి

TG: ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ KCR అనుచరులు పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి ఫైరయ్యారు. సంతలో కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని, కానీ అది జరగదని స్పష్టం చేశారు. ములుగు(D) వెంకటాపూర్లో రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న పొంగులేటి.. పేదల కన్నీటిని తుడిచేందుకే భూ భారతి తీసుకొచ్చామన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు.
News April 18, 2025
TTD ఛైర్మన్ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి

AP: గోశాలలో గోవుల మరణంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయసు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 18, 2025
కాసేపట్లో వర్షం!

TG: పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, MBNR, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.