News August 5, 2024

మరో మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్

image

ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఓ మనిషి(<<12569229>>అర్బాగ్<<>>) మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రవేశపెట్టిన న్యూరాలింక్ తాజాగా మరో వ్యక్తిలోనూ చిప్ అమర్చినట్లు తెలిపింది. అతని మెదడులోని 400 ఎలక్ట్రోడ్‌లు సరిగ్గా పనిచేస్తున్నట్లు సంస్థ CEO ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏడాది DECలోగా మరో 8 మంది మెదళ్లలో చిప్‌ను ప్రవేశపెడతామన్నారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగపడేలా ఈ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Similar News

News March 12, 2026

రష్మిక మందన్న ఆగ్రహం.. కారణమిదే!

image

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై హీరోయిన్ రష్మిక సీరియస్‌ <<19364152>>అయిన<<>> విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దయ్యాక ఆమె తల్లి సుమన్ మందన్న ఇచ్చిన పాత ఇంటర్వ్యూను కొందరు వక్రీకరిస్తూ వార్తలు రాయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘గీత గోవిందం’ వివాదం, పెళ్లి తర్వాత నటన మానెయ్యాలనే ఆంక్షలు, రక్షిత్ తల్లికి సారీ చెప్పమనడం వంటి విషయాలను కన్నడ మీడియా తప్పుగా రాయడంతో ఆమె ఇలా రియాక్ట్ అయ్యారని సమాచారం.

News March 12, 2026

ఫిబ్రవరిలో పెరిగిన ద్రవ్యోల్బణం

image

దేశంలో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2%కు పెరిగింది. కాగా ఇది జనవరిలో 2.74%గా ఉంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది RBI నిర్ణయించిన 2-6% టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉందని కేంద్రం తెలిపింది. ఆహార ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.75%గా ఉంది.

News March 12, 2026

JEE MAIN: దరఖాస్తులకు మరో ఛాన్స్!

image

జేఈఈ మెయిన్‌ సెషన్-2కు దరఖాస్తు చేసుకునేందుకు NTA మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో రిజిస్ట్రేషన్ల విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు రాత్రి 9 గంటల వరకు <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇప్పటికే సబ్మిట్ చేసిన అప్లికేషన్లలో మార్పులకు పర్మిషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి.