News December 26, 2024
నక్కపల్లికి మరో ఫార్మా సెజ్: సీఎం రమేశ్
AP: విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మా సెజ్ ఏర్పాటుకానుందని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద రూ.75వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News January 26, 2025
విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.
News January 25, 2025
‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం
కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
News January 25, 2025
PHOTO: రిహార్సల్స్ మొదలుపెట్టిన మహేశ్ బాబు
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైందని నిన్న జక్కన్న హింట్ ఇచ్చారు. తాజాగా మహేశ్ ఫొటో వైరలవుతోంది. ఆయన స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైనర్తో పాటు ఉన్న ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిహార్సల్స్ మొదలయ్యాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.